సింగరేణిలో సమ్మె వాయిదా
హైదరాబాద్ : సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా సమ్మెబాట పట్టిన సింగరేణి కార్మికులు తమ సమ్మెను వాయిదా వేసుకున్నారు. గోదావరిఖనిలో సింగరేణి జాతీయ సంఘాల నాయకులు శనివారం మధ్యాహ్నం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారసత్వ ఉద్యోగాలపై యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
జాతీయ కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకునేది లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో తమ డిమాండ్లను ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని నేతలు నిర్ణయించి గత పది రోజులుగా చేస్తున్న సమ్మెను వాయిదా వేసుకున్నారు. సింగరేణిలో ఈ నెల 15 నుంచి కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.