గోల్డెన్ పీకాక్ అవార్డుకు సింగరేణి ఎంపిక

గోల్డెన్ పీకాక్ అవార్డుకు సింగరేణి ఎంపిక - Sakshi


సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలతో పాటు వినూత్న పర్యావరణహిత చర్యలతో దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సింగరేణి సంస్థ 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఎంపికైంది.



సోమవారం దుబాయిలో జరిగిన ఐఓడీ అంతర్జాతీయ సదస్సులో ఈ అవార్డును సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్... యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ కల్చర్, యూత్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముభారఖ్ అల్ నహ్యాన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ ఏడాది ఐఓడీ సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో సింగరేణి సంస్థకు ఈ ‘గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటీవ్ ప్రొడక్స్/సర్వీస్ అవార్డు 2015’ను ఇవ్వడానికి నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top