ముంగిట్లో మరో రికార్డు!
- సంపూర్ణ డిజిటల్ వైపు సిద్దిపేట అడుగులు
- దేశంలోనే తొలి నియోజకవర్గంగా గుర్తింపు!
- ఇప్పటికే 70 గ్రామాల్లో నెట్వర్క్
- మరో 30 గ్రామాల్లో ప్రక్రియకు చర్యలు
- రైల్టెల్ అధికారులతో మంత్రి హరీశ్రావు భేటీ
సిద్దిపేట జోన్: సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకు నేందుకు అడుగు వేసింది. దేశంలోనే తొలి సంపూర్ణ డిజిటల్ అసెంబ్లీ నియోజకవర్గంగా సిద్దిపేటను చరిత్ర పుటల్లో నిలిపేందుకు ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వందశాతం హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం ఉన్న నియోజకవర్గంగా జిల్లా రికార్డు సృష్టించనుంది. ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్టెల్ అధికారులు శనివారం భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావుతో చర్చించారు. అక్కన్న పేట, కరీంనగర్ రైల్వేస్టేషన్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గానికి 160 కిలోమీటర్ల మేరకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని విస్తరించే చర్యలు పూర్తయినట్లు రైల్టెల్ సంస్థ దక్షిణాది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ.శ్రీకాంత్ మంత్రికి వివరించారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజల కోసం ఒక ఉచిత వైఫై సెంటర్ను ఏర్పాటు చేయను న్నారు. రైల్టెల్ నెట్ వర్క్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామానికి కూడా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు వేగవంతం చేస్తామని, ఇప్పటికే 70 గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించామని, మిగతా 30 గ్రామాలను త్వరితగతిన పూర్తి చేసి వంద గ్రామాలకు రైల్టెల్ బ్రాడ్బ్యాండ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. నెలలోగా వందశాతం గ్రామాలకు సౌకర్యం అమల య్యేలా చూడాలని మంత్రి హరీశ్రావు వారికి సూచించినట్లు సమాచారం.
రైల్టెల్ అధికార యంత్రాంగం చేస్తున్న కృషిని అయన ప్రశంసించారు. మండల పరిషత్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో లైవ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్ కోసం సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. త్వరలో కలెక్టర్ నేతృత్వంలో రైల్టెల్ నిపుణులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తానని, ప్రతిష్టాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గంలో వందశాతం బ్రాడ్బ్యాండ్ వ్యవస్థను అమలు చేసేందుకు జరుగుతున్న ప్రక్రియను వేగవంతం చేయాలని సమీక్షలో మంత్రి సూచించినట్లు తెలిసింది.