అదే స్టేషన్‌లో మరో ఎస్‌ఐ ఆత్మహత్య

అదే స్టేషన్‌లో మరో ఎస్‌ఐ ఆత్మహత్య - Sakshi

కుకునూరుపల్లి: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కుకునూరుపల్లి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రెడ్డి బుధవారం తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి స్వస్థలం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టం‍గుటూరు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

కాగా.. గతంలో(2016 ఆగష్టు) ఇదే స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేసిన రామకృష్ణారెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోగా.. ఆయన స్థానంలో నియమితుడైన ప్రభాకర్‌ రెడ్డి కూడా అదే తీరుగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు రామకృష్ణారెడ్డి కాల్చుకొని చనిపోయిన గదిలోనే ప్రభాకర్‌రెడ్డి కూడా మృతిచెందడం గమనార్హం. ఒకే స్టేషన్‌లో ఇద్దరు ఎస్‌ఐల ఆత్మహత్య పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top