రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
రంగారెడ్డి :
హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎస్ఐ ఖలీల్ పాషా అక్కడిక్కడే మృతిచెందాగా, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో పని చేస్తున్న ఖలీల్ పాషా సెలవులు రావడంతో స్వస్థలానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గాయపడిన ఇద్దరూ ఖలీల్కు సమీప బంధువులుగా తెలుస్తోంది.