'డ్రస్సులపై ఉన్న శ్రద్ధ రైతు ఆత్మహత్యలపై లేదు'

'డ్రస్సులపై ఉన్న శ్రద్ధ రైతు ఆత్మహత్యలపై లేదు' - Sakshi


హైదరాబాద్: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. విదేశాల్లో మోదీ మీటింగ్లు రాక్ సింగర్ కార్యక్రమాలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోదీకి డ్రస్సుల మార్చడంపై ఉన్న శ్రద్ధ దేశంలో రైతుల ఆత్మహత్యలపై లేదని షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా విదేశాలకు వెళ్లారా లేక దేశ ప్రధానిగా వెళ్లారా అంటూ మోదీని షబ్బీర్ అలీ సూటిగా ప్రశ్నించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top