గిరిజన మూగ బాలికపై లైంగికదాడి

గిరిజన మూగ బాలికపై లైంగికదాడి - Sakshi


గర్భవతిని చేసిన యువకుడు

నిందితుడి ఇంటి ఎదుట బాలిక తల్లిదండ్రుల బైఠాయింపు




మద్దూరు: ఓ గిరిజన మూగ బాలికపై లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. గ్రామ పెద్దలు ఇరు కుటుంబాలతో పంచాయితీ నిర్వహించి బాధితురాలికి రూ.లక్షన్నర పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పారు. అయితే  నిందితుడు పరిహారం ఇవ్వకపోవ డంతో శనివారం బాలిక తల్లిదండ్రులు నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం తోర్నాలలో జరిగింది. గ్రామంలోని హన్మాన్‌తండాకు చెందిన గిరిజన బాలిక (17) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా డాక్టర్‌ ఆమెను పరీక్షించి గర్భవతి అని నిర్ధారించారు. తోర్నాలకు చెందిన గోనే పరమేశ్వర్‌ తనను లోబరుచుకున్నాడని కుటుంబసభ్యులకు బాలిక చెప్పింది.



దీంతో వారు గ్రామంలోని పెద్దలను ఆశ్రయించగా బాధిత కుటుంబానికి రూ.లక్షన్నర పరిహా రం ఇవ్వాలని తీర్పు చెప్పారు.  బాధితు రాలికి ఈ నెల 10న కొంత మొత్తాన్ని ఇవ్వా ల్సి ఉంది. అయితే దానిని ఇవ్వడానికి అతడు నిరాకరించాడు. దీంతో బాలిక తల్లి దండ్రులు పెద్ద మనుషులను ఆశ్రయిం చారు. తమకు తెలవకుండా గర్భం ఎలా తీసేయిస్తారని ఎదురు ప్రశ్నించారు. దీంతో వారు శనివారం నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. బాధిత కుటుంబంతో నిం దితుడి కుటుంబసభ్యులు ఘర్షణకు దిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top