జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏడుగురు ఎంపిక
సాక్షి, హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఉపాధ్యా యులు జాతీయ ఉత్తమ ఉపా ధ్యాయులుగా ఎంపికయ్యారు. శనివారం ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమాచారం అందింది. ప్రాథమిక పాఠశాల నుంచి నలుగురు, ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.
టీచర్ పాఠశాల జిల్లా
వీ కిషన్ ఎంపీపీఎస్ పాత యల్లాపూర్ నిర్మల్
కుక్కముడి జనార్దన్ పీఎస్ శివన్నగూడ నల్లగొండ
మంతటి నారాయణ యూపీఎల్ పల్కపల్లి నాగర్కర్నూల్
నానుగొండ విజయలక్ష్మి ఎంపీపీఎస్ కులాస్పూర్ నిజామాబాద్
గుండేటి యోగేశ్వర్ జెడ్పీహెచ్ఎస్, మంచిర్యాల మంచిర్యాల
కందుకూరి సురేందర్ జెడ్పీహెచ్ఎస్, జగిత్యాల జగిత్యాల
పొట్ట రామారావు జెడ్పీహెచ్ఎస్, ఏన్కూర్ ఖమ్మం