‘సెస్’ చైర్మన్‌గా లక్ష్మారెడ్డి?

‘సెస్’ చైర్మన్‌గా లక్ష్మారెడ్డి? - Sakshi


- పది మంది డెరైక్టర్లతో పాలకవర్గం

- నామినేట్ చేసేందుకు రంగం సిద్ధం

సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) చైర్మన్‌గా దోర్నాల లక్ష్మారెడ్డిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సిరిసిల్ల మండలం తంగళ్లపల్లికి చెందిన లక్ష్మారెడ్డి న్యాయవాదిగా సిరిసిల్లలో స్థిరపడ్డారు. టీడీపీ హయాంలో లక్ష్మారెడ్డి సెస్ చైర్మన్‌గా పనిచేశారు. పదిమంది డెరైక్టర్లతో సెస్ పా లకవర్గాన్ని నామినేటెడ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిరిసిల్ల పట్టణానికి, రూరల్‌కు ఒక్కో డెరైక్టర్‌తో మిగతా ఎనిమిది మండలాలకు ఒక్కో డెరైక్టర్ చొప్పున మొత్తం పది మంది డెరైక్టర్లను నియమించే అవకాశం ఉంది.



ఇప్పటికే ఇల్లంతకుంట డెరైక్టర్ స్థానానికి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అ భ్యర్థిని ఎంపిక చేయగా, చొప్పదండి ఎమ్మె ల్యే బొడిగె శోభ బోయినపల్లి డెరైక్టర్‌ను ఎంపి క చేసినట్లు సమాచారం. వేములవాడ ఎమ్మె ల్యే రమేశ్‌బాబు ముగ్గురు డెరైక్టర్ల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిసింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ తన పరిధిలోని ఐదు స్థానాలకు డెరైక్టర్లను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.



ఆశావహులు ఇప్పటికే మంత్రిని కలుస్తూ మనసులోని మాట చెబుతున్నట్లు తెలిసింది. మరో పదిరోజుల్లో సెస్ పాలకవర్గం కొలువుదీరే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో సెస్ పాలకవర్గాన్ని నామినేటెడ్ చేయగా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈసారి వాటిని అధిగమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లక్ష్మారెడ్డి చైర్మన్‌గా పది మంది డెరైక్టర్లతో పాలకవర్గాన్ని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top