సీజ్ చేస్తే సరోగసీ తల్లుల పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: సరోగసీ దందా చేస్తున్న ఆస్పత్రిపై దాడులు చేసి తాళాలు వేస్తే.. సరోగసీ ద్వారా గర్భం దాల్చి న తల్లి, కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. చట్టాల ప్రకారం ఫెర్టిలిటీ ఆస్పత్రులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి కానీ అద్దె గర్భం దాల్చిన వారి గురించి కూడా ఆలోచించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని సాయికృష్ణ హాస్పిటల్– కిరణ్ సంతాన సాఫల్య కేంద్రంపై పోలీసులు దాడి చేసి, సీజ్ చేసినట్లు వార్తా కథనాలను చదివిన న్యాయమూర్తి జస్టిస్ సురేశ్కుమార్ కెయిత్ తన ఆవేదనను లేఖ రూపం లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగ నాథన్ ముందుంచారు.
దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యం గా పరిగణించిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టిం ది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమే శ్రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనీల ధర్మాసనం విచారించింది. విచారణను 29కి వాయిదా వేసింది. అద్దె గర్భం దాల్చిన వారి వివరాలు బయటకు రాకుండా కౌంట ర్ దాఖలు చేయాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది.