రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
యాదద్రి భువనేగిరి జిల్లా : మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎలగల కృష్ణ (48) మృతి చెందాడు. కృష్ణ ద్విచక్ర వాహనంపై బస్టాండ్ వైపు నుంచి రైల్వేగేటు వైపునకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం వెనక భాగం అతని వాహనానికి తగలడంతో కిందపడ్డాడు. దీంతో తల వెనుక భాగంలో తీవ్రగాయమై అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయమై స్థానిక ఎస్ఐ నర్సింహులును వివరణ కోరగా ప్రమాదానికి సంబంధించి సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కృష్ణ గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కృష్ణ మృతిపట్ల డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్రావు, టీడీపీ పట్టణ అ«ధ్యక్షుడు సలీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ. జైనోద్దీన్, కొలుపుల హరినాథ్, కె.సాగర్రెడడ్డి, ఇల్లెందుల మల్లేశం సంతాపం వ్యక్తం చేశారు. కాగా కృష్ణ మృతికి నిరసనగా నేడు పట్టణ బంద్ చేపట్టనున్నారు.