స్కూల్ బస్సును ఢీకొన్న లారీ
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి సమీపంలో ఓ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని సహా మొత్తం ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా, 57 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ జిల్లా వెంకటరావుపేటకు చెందిన బ్రూక్లిన్ హైస్కూల్ బస్సు సుమారు 60 మంది విద్యార్థులతో కమ్మర్పల్లిలోని హాసాకొత్తూరు క్రాస్రోడ్డు నుంచి సోమవారం ఉదయం జాతీయ రహదారిపైకి ప్రవేశిస్తుండగా.. మోర్తాడ్ వైపు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. భారీ వర్షానికి తోడు దట్టమైన నల్లటి మేఘాలు ఆవరించి ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.