సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
చొప్పదండి : చొప్పదండి ఎస్సై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండలంలోని గుమ్లాపూర్ సర్పంచ్ ముష్కె వెంకట్రెడ్డి గురువారం సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు ఇలా ఉన్నారుు..బుధవారం గ్రామజ్యోతిలో భాగంగా గ్రామంలో ఓ వీధి వెడల్పులో సర్పంచ్కు, స్థానిక మహిళకు గొడవ జరిగింది. ఇరువురు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. సర్పంచ్పై బుధవారం 290, 323, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వ్యక్తిగత కక్షలతో సంబంధంలేని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తహశీల్దార్ పద్మయ్య, ఎంపీడీవో అన్వర్ హుస్సేన్, మండలంలోని తోటి సర్పంచులకు తెలిపాడు. గురువారం మధ్యాహ్నం గ్రామంలోని సెల్టవర్ వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామాల సర్పంచులు, తహశీల్దార్, ఎంపీడీవోలు సర్పంచ్తో మాట్లాడారు. ఆవేశంలో తాడుతో ఉరివేసుకొని కిందికి వేలాడాడు. తోటి సర్పంచులు పైకి ఎక్కి కిందకు తీసుకువచ్చారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీవో , సర్పంచ్లు, నాయకులు వివాదంగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు.
ఆరోపణలు నిరాధారం : రవీందర్, ఎస్ఐ
గుమ్లాపూర్ సర్పంచ్పై బుధవారం పలు సెక్షన్ కింద కేసు నమోదైంది. కేసు ను పక్కదారి పట్టించేందుకే సెట్ టవర్ ఎక్కాడు. సర్పంచ్ ఆరోపణలు నిరాధారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేశాం.