సంజీవరెడ్డికే టిక్కెట్టు

సంజీవరెడ్డికే టిక్కెట్టు - Sakshi


‘ఖేడ్’ కాంగ్రె?స పార్టీ అభ్యర్థిగా ఖరారు

ప్రకటించిన హైకమాండ్

‘ఒప్పందం’తో వర్గపోరుకు చెక్

నారాయణఖేడ్:
ఖేడ్ ఉప ఎన్నిక కోసం కాంగ్రె?స పార్టీ సిద్ధమైంది.. ఆ దిశగా ముందస్తుగా అభ్యర్థి పేరును ఖరారు చేసింది. మరోసారి విజయం సాధించాలన్న పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా ‘ఒప్పందం’ ప్రకారం వర్గపోరు సమసిపోయేలా మంత్రాంగం నడిపినట్టు సమాచారం. కార్యకర్తలను కూడా కార్యోన్ముఖులను చేసేందుకు అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రె?స పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి పెద్దకుమారుడు, నారాయణఖేడ్ ఎంపీపీ డాక్టర్ సంజీవరెడ్డి పేరును ఖరారు చేసినట్టు వినికిడి.  కాంగ్రె?స పార్టీ హైకమాండ్ అభ్యర్థి ఖరారుపై సోమవారం ప్రకటన చేసింది. పార్టీ రా? వ్యవహారాలపై నేతలు జానారెడ్డి, పీసీసీ ?ఫ ఉత్తవఖుకుమార్‌రెడ్డి, శబ్బీర్ అలీ ఢిల్లీలో దిగ్విజయఖుసింగ్‌ను కలిసి ఉప ఎన్నికలపై చర్చించారు. కిష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పేరును పార్టీ ఖరారు చేసింది.



 టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తవఖుకుమార్‌రెడ్డి అధికారికంగా ప్రకటించడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కిష్టారెడ్డి కుమారులందరూ మాట్లాడుకొని సంజీవరెడ్డిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిష్టారెడ్డి ఆగస్టు 25న గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది.



అసెంబ్లీ టిక్కెటఖ విషయంపై కాంగ్రె?స పార్టీలో వర్గ పోరు నడుస్తోంది. మాజీ ఎంపీ సురేష షెట్కర్ వర్గానికి చెందిన నగేశఖ షెట్కర్ పోటీలో నిలబడుతారని ప్రచారం జరిగింది. ఇరువర్గాలు.. టికెటఖ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు. పార్టీ అధినాయకత్వం సురేష షెట్కర్, కిష్టారెడ్డి కుమారుల మధ్య రాజీ కుదిర్చి ఒప్పంద పత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికల్లో సంజీవరెడ్డి పోటీచేస్తారని, ఆయనకు  మాజీ ఎంపీ సురేష షెట్కార్ పూర్తిసహకారం అందించి గెలుపునకు కృషి చేయాలని, వచ్చే 2019 ఎన్నికల్లో సురేష షెట్కార్ అసెంబ్లీకి పోటీచేస్తారని, అప్చడు సంజీవరెడ్డి సహకరించి గెలుపునకు పాటుపడాలని ఒప్పందానికి వచ్చినట్టు వినికిడి. సురేష షెట్కార్, కిష్టారెడ్డిలు సైతం గతంలో ఇలాగే ఓ పర్యాయం ఒప్పందాలు చేసుకొని ఒకరి గెలుపునకు ఒకరు పాటుపడ్డారు.



ప్రస్తుతం కూడా ఇదే తరహాలో పార్టీ గెలుపు కోసం ఇరువురూ పాటుపడాలని పార్టీ హైకమాండ్‌వద్ద ఒప్పందాలు జరిగినట్టు భ్ఠగట్టా. ఢిల్లీలో దిగ్విజయఖుసింగ్ వద్ద జానారెడ్డి, ఉత్తవఖుకుమార్‌రెడ్డి, శబ్బీర్ అలీ జరిపిన చర్చల్లో  ఒప్పందం విషయం చర్చించాక కిష్టారెడ్డి కుమారుల్లో ఒకరికి టికెటఖ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top