రైతును ట్రాక్టర్తో ఢీకొట్టిన ఇసుక మాఫీయా


మహబూబ్నగర్ : మహబూబ్నగర్లో ఇసుక మాఫీయా మరోసారి రెచ్చిపోయింది. తన పొలం నుంచి ఇసుక రవాణాను అడ్డుకున్న రైతుపై ఇసుక మాఫీయా దాడి చేసింది. రైతు పెంటయ్యను దుండగులు ట్రాక్టర్తో ఢీకొట్టారు. ఈ సంఘటన చిన్నచింతకుంట మండలం అల్లిపూర్లో చోటుచేసుకుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top