ఇక ఆన్లైన్లోనే ఇసుక బుకింగ్
హైదరాబాద్: తెలంగాణలో ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇసుక వ్యాపారం మాఫియాలో సాగిందని చెప్పారు. అయితే ఇప్పటికే తక్కువ ధరకే ఇసుకను అందించే విధంగా కొత్త పాలసీని ప్రకటించినట్టు ఆయన అన్నారు.
ఇకపై ఆన్లైన్లోనే ఇసుక బుక్ చేసుకోనే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. తమ ఆదాయం కోల్పోతున్నామనే కొంతమంది రాజకీయ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి హరీష్రావు అన్నారు.