సాక్షి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు


సాక్షి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పారామంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంబరాల్లో తెలంగాణ రాజకీయ, సినీ రంగ, ఉద్యోగ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో శిల్పారామం దద్దరిల్లింది. దాండియాతో అమ్మాయిలు అదరగొట్టారు. ఆద్యంతం తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బతుకమ్మ సంబరాలు సాగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు డీకే అరుణ, శ్రీనివాస గౌడ్, మాజీ మేయర్ కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top