ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: ముగ్గురు యువకుల మృతి


మెదక్ (సదాశివపేట): అతి వేగంగా వస్తున్న ద్విచక్రవాహ నం ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట శివారులో సోమవారం చోటుచేసుకుంది. వికారాబాద్ నుంచి సదాశివపేట వస్తున్న ఆర్టీసీ బస్సును సదాశివపేట నుంచి వికారాబాద్ వెళ్తున్న బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.



దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట నా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top