ఆర్టీఏ దాడులు: 15 స్కూల్ బస్సులు సీజ్
యాదాద్రి: వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. దీంతో ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్లపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులను సీజ్ చేశారు. భువనగిరి పట్టణంలో ఫిట్నెస్ లేకుండా స్కూలు పిల్లలను తరలిస్తున్న 15 ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేశారు. తనిఖీలు కొనసాగిస్తున్నారు.