ఆర్ఎస్ఎస్ నేత టీవీ దేశ్ముఖ్ మృతి


హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ టీవీ దేశ్ముఖ్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ బాధపడుతున్న ఆయన దీపావళి రోజున  తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు క్షేత్ర సంచాలకులుగా ఆయన పనిచేశారు.



టీవీ దేశ్ముఖ్ భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన అంత్యక్రియలకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. దేశ్ముఖ్ మరణం పట్ల బీజేపీ నేతలు కిషన్రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top