రూ.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం


నల్లగొండ : నకిలీ నోట్ల చలామణి చేస్తున్న నలుగురు సభ్యలు ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.  నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద పక్కా సమాచారంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై శనివారం ఉదయం చివ్వెంల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. దీంతో ఓ కారులో దొంగనోట్లు తరలిస్తున్న ముఠా పట్టుబడింది. వాహనంతోపాటు అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

(చివ్వెంల)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top