క్యాషియర్ను కొట్టి.. దోపిడీ
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ పెట్రోల్ బంకులో సోమవారం రాత్రి దోపిడీ జరిగింది. ముత్తగూడెంలోని పెట్రోల్ బంకులోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి క్యాషియర్ ఏసు వద్ద ఉన్న బ్యాగ్ను లాక్కునేందుకు యత్నించాడు. అతడు ప్రతిఘటించటంతో విపరీతంగా కొట్టి, రూ.5 వేలు తీసుకున్నాడు. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న ఏసును గమనించిన స్థానికులు నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు క్షతగాత్రుడిని వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.