నల్గొండలో భారీ చోరీ

నల్గొండలో భారీ చోరీ - Sakshi


నల్గొండ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని విద్యానగర్ కాలనీలో ఉంటున్న మీర్ హుస్సేన్ అలీ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి దొంగలు రెచ్చిపోయారు. దాదాపు రూ.3.65 లక్షల నగదు, 8 తులాల బంగారం, 40 తులాల వెండిపట్టీలు, ఒక ఎల్‌సీడీ టీవీలను చోరీ చేశారు. అలీ తన భార్యతో కలిసి పక్క ఊరిలో ఉన్న బావమరిది చనిపోవడంతో శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం అలీ భార్య సానియా వచ్చి చూసేసరికి తలుపు తెరిచి ఉండటంతో షాక్ కు గురయ్యారు. అనంతరం ఆమె చోరీ గురించి భర్తకు తెలియజేసింది. చోరీపై మీర్ హుస్సేన్   పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీం, డాగ్‌స్వాడ్ రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.




(మిర్యాలగూడ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top