రెడ్డిపల్లిలో చోరీ


వీనవంక: కరీంనగర్ జిల్లా వీనవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడిగొప్పుల సంపత్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పెంకుటిల్లు పైకప్పు తొలగించి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, రూ.45 వేల నగదు దోచుకెళ్లారు. శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top