వికారాబాద్ జిల్లాలో దొంగల బీభత్సం
వికారాబాద్: మండలంలోని కామారెడ్డి గూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి గ్రామంలోని ఆరు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలు చేశారు.
దొంగలను గుర్తించిన నల్లా రాంరెడ్డి(48) అనే వ్యక్తి వారిని అడ్డుకోవడానికి యత్నించగా దుండగులు అతన్ని దారుణంగా హతమార్చి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.