మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం


మహబూబాబాద్‌: మహబూబాబాద్‌లోని ఎటిగడ్డ తండాలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తండాలోని చాంప్లా ఆర్ముఖం అనే వ్యక్తిపై దాడి చేసి రూ.1.70 లక్షల నగదు, 12 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు లాక్కెళ్లారు.

 

ఈ దాడిలో ఆర్ముఖం తీవ్రంగా గాయపడటంతో వైద్య నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top