ట్రాక్టర్‌ బోల్తా


గుంటూరు వాసి మృతి



సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం దోనబండ తండా దగ్గర గురువారం ఉదయం ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన శేషయ్య(45)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. వరి గడ్డి కొనుగోలు కోసం ట్రాక్టర్‌లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top