రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
కడ్తాల్(రంగారెడ్డి జిల్లా): కడ్తాల్ తలకొండపల్లి మార్గంలో టిప్పర్ను ఓవర్టేక్ చేయబోయి బైక్పై వెళ్తున్న ఓ కుటుంబం దాని వెనక టైరు కిందపడింది. ఈ ఘటనలో భద్రయ్య(35), వంశీ(10), చరణ్(8) అక్కడికక్కడే మృతిచెందగా.. భద్రయ్య భార్య సరితకు తీవ్రగాయాలయ్యాయి.
ఆమెను చికిత్స నిమిత్తం 108 వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుల స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేటగా గుర్తించారు. భద్రయ్య మిడ్జిల్ మండలంలోని ఓ పౌల్ట్రీ ఫాంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.