మహబూబ్ నగర్ లో రోడ్డు ప్రమాదం


మహబూబ్ నగర్:  మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జిల్లాలోని వనపర్తి మండలం తిరుమలాయ గుట్ట వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు... మ౦డల౦లోని కిష్టగిరి గ్రామానికి చె౦దిన కావలి కృష్ణయ్య(50), కావలి రమేష్(25) పని నిమిత్తం వనపర్తికి వచ్చితిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని తిరుమలాయ గుట్ట వద్ద గుర్తు తెలియని వాహన౦ డీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చె౦దారు. మృతులు ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చె౦దిన వ్యక్తులు కావడ౦తో గ్రామ౦లో విషాద చాయలు అలముకున్నాయి. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top