చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం

చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం - Sakshi


ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ లేఖ



హైదరాబాద్: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. ఇందుకోసం వీలైనంత త్వరలో చర్యలు చేపట్టాలని కోరారు. వెనుకబడినవర్గాలకు కూడా 33 శాతం రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్నారు.



ఓబీసీల అభివృద్ధి కోసం కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని సూచించారు.  ఈ మేరకు తెలంగాణ  అసెంబ్లీ, మండలిల్లో ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు కేసీఆర్ గుర్తుచేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top