రైల్లో రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్(బెల్లంపల్లి): రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. అధికారులు ఎన్నిక తనిఖీలు చేపట్టినా అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. తాజాగా ఖాజీపేట నుంచి మహారాష్ట్రలోని బళ్లార్ష వెళ్తున్న రామగిరి ప్యాసింజర్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం ఉదయం జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంచులు మార్పిడి చేసి రేషన్ బియ్యాన్ని తరలించినట్లు పోలీసులు తెలిపారు. రామగిరి ప్యాసింజర్ రైలు బెల్లంపల్లి స్టేషన్ వద్ద ఆగిన సమయంలో సుమారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.