ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం

ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం - Sakshi


కేసు నమోదు చేసిన పోలీసులు

 

 పూడూరు : ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన బాలిక(17) వికారాబాద్‌లో ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కుర్వ భీరప్ప(20) ఆటో డ్రైవర్. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. చదువు కోసం బాలికతో పాటు కుటుంబీకులు వికారాబాద్ పట్టణ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప కాలనీలో అద్దెకు ఉంటున్నారు.



ఇదిలా ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం భీరప్ప బాలికను కాలేజీ వద్ద ఆటోలో ఎక్కించుకుని పూడూరు మండలం మన్నెగూడలోని సర్వే నంబర్ 50లో ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను కాలేజీ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేవెళ్ల సీఐ ఉపేందర్ శనివారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అత్యాచారం ఘటనపై బాలిక కుటుంబీకులు శనివారం వికారాబాద్ సబ్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top