‘3న రంగారెడ్డి జిల్లా వైఎస్సార్‌సీపీ సమావేశం’


సాక్షి,హైదరాబాద్: ఈ నెల 3న రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ రంగారెడ్డి జిల్లా పరిశీలకుడు  కె.శివకుమార్ తెలిపారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘సాక్షి’ తో మాట్లాడారు.  లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్రకార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభమవుతుందని చెప్పారు.


జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ పరిధిలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఉప్పల్, ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ పరిధిలోని  48వ డివిజన్‌లోని కార్యకర్తలు, నేతలు తరలిరావాలన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణం, రూరల్ నియోజక వర్గాల్లో కొత్త కమిటీల ఏర్పాటు విషయంపై చర్చ ఉంటుందన్నారు. ప్రత్యేక ఎజెండాలో తాగునీరు, విద్యుత్ కోతల సమస్యలపై కూడా చర్చిస్తారని చెప్పారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top