నేడే ఈద్-ఉల్-ఫితర్


ఈద్ ముబారక్

బాన్సువాడ : 29 రోజుల ఉపవాసాలు ముగిశాయి. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పండగ (ఈద్-ఉల్-ఫితర్) రంజాన్, షవ్వాల్ మాసంలోని మొదటి రోజు వస్తుంది. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో మంగళవారం నాడు రంజాన్ పండగను జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. ఈ పండగ జిల్లా లో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈద్-ఉల్-ఫిత ర్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూ ర్,  కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లోని ఈద్‌గాహ్‌లలో ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top