యువకుడి ఆత్మహత్య
చేవెళ్ల(రంగారెడ్డి): పొలం దగ్గరికి వెళ్తున్ననని చెప్పి వెళ్లిన యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రమేష్(20) ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలానికి వెళ్తున్నానని చెప్పి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.