రామగుండంలో మరిన్ని ఎన్టీపీసీ యూనిట్లు

రామగుండంలో మరిన్ని ఎన్టీపీసీ యూనిట్లు


జ్యోతినగర్: కరీంనగర్ జిల్లాలోని రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు సమీపంలో మరిన్ని విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు ఆ సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి తెలిపారు. తెలంగాణ స్టేజ్-1లో భాగంగా రామగుండంలోనిర్మిస్తున్న 1600 మెగావాట్ల (ఒక్కోటీ 800) ప్రాజెక్టు పనులను ఆదివారం ఆయన సందర్శించారు.


ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ... మరో 10వేల మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి సరిపడా స్థలం అందుబాటులో ఉందన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడనున్నట్టు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top