'అలా అయితే నాకు కూడా కష్టమే'

'అలా అయితే నాకు కూడా కష్టమే'


హైదరాబాద్: ఎన్నికలకు ముందు కేసీఆర్‌ తెలంగాణ వారంతా స్థానికులే అన్నారని, గెలిచిన తర్వాత ఆ హామీని మరిచిపోవడం సమంజం కాదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక సరికాదన్నారు. ఆ ప్రాతిపదికన తన లాంటి వారు కూడా స్థానికతను రుజువు చేసుకోవడానికి కష్టడాల్సిందేనని వాపోయారు.



ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ఎటువంటి మార్పులు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం  అమలు చేయాలని సుధీర్రెడ్డి కోరారు. 1956, నవంబర్ 1 నుంచి తెలంగాణలో ఉంటున్న వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top