' సమస్యలు ఎదురైతే దైర్యంగా ఎదుర్కోండి'


వరంగల్: వరంగల్ జిల్లా అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని అన్నపూర్ణ పరపతి సంఘభవనంలో తెలంగాణ మహిళా సమతా సొసైటీ ఆధ్వర్యంలో బాలికలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. సమాజంలో బాలికలు ఏవిధంగా సమస్యలను అధిగమించాలి అనే అంశంపై చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మమతా రఘవీర్ అవగాహన కల్పించారు.


మహిళల హక్కులు, బాధ్యతల గురించి సుధీర్ఘంగా ప్రసంగించారు. మానసిక, శారీరక మార్పుల గురించి వివరించారు. సమస్యలు ఎదురైనపుడు దైర్యంగా ఎదుర్కొవాలన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండలానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top