డివైడర్‌ను ఢీకొన్న ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు

డివైడర్‌ను ఢీకొట్టిన ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు


మహబూబ్‌ నగర్‌ : మహబూబ్‌ నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం రంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పన్నెండుమంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు మైసూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.











Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top