స్కూలు బస్సు- బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
వరంగల్ (మామునూరు): ఓ ప్రైవేట్ స్కూలు బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లా మామునూరు పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మామునూరుకు చెందిన పూర్ణచంద్రరావు, రాజు అనే విద్యార్థులు వరంగల్లో డిగ్రీ చదువుతున్నారు. శుక్రవారం కళాశాలకు బైక్పై వెళుతుండగా మామునూర్లో స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.