26న రాష్ట్రపతి పర్యటన ఇలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర పర్య టన ఖరారైంది. ఉస్మానియా విశ్వ విద్యాలయం శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించేందుకు ఈ నెల 26న హైదరా బాద్కు రానున్నారు. గోవా నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:15 గంటల కు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 12:30 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకొని శతాబ్ధి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
ఆ తర్వాత రాజ్భవన్ చేరుకొ ని అక్కడి నుంచి సాయంత్రం 4:30 గంట లకు గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాం తి సరోవర్ ఆడిటోరియంలో ‘ఇంగ్లిష్ అండ్ ఫారిన్ ల్యాంగ్వేజెస్ యూనివర్సిటీ’ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అనంత రం బేగంపేట విమానాశ్రయానికి చేరు కొని ప్రత్యేక విమానంలో సాయంత్రం 5:55 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళతారు.