5న యాదాద్రికి ప్రణబ్

5న యాదాద్రికి ప్రణబ్ - Sakshi


హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 5న యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొంటారని సమాచారం. గత నెల 30 న రాష్ట్రపతి హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈనెల 5న యాదగిరి గుట్టకు వెళ్లనున్నట్టు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top