'తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలి'


హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజా గాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. నాంపల్లి కోర్టులో శుక్రవారం న్యాయవాదులు చేస్తున్న ధర్నాకు గద్దర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయంగా సమస్యలు తీరాయి.. కాని పరిపాలన పరమైన సమస్యలు ఇంకా తీరలేదని ఆయన అన్నారు. హైకోర్టు ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దర్ ఈ సంర్భంగా ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top