రేపటితో ముగియనున్న రాష్ట్రపతి పర్యటన
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ పర్యటన రేపటితో ముగియనుంది. రాష్ట్రపతికి పది రోజుల శీతాకాల విడిదిని ముగించుకుని బుధవారం ఢిల్లీ బయల్దేరివెళ్లనున్నారు. ఉదయం గం.11.30 ప్రాంతంలో రాష్ట్రపతి ఢిల్లీకి పయనం కానున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం, మంత్రులు వీడ్కోలు పలకనున్నారు.