గర్భిణి ఆత్మహత్యాయత్నం


బూర్గంపాడు: భర్తతో మనస్పర్థల కారణంగా ఓ గర్భిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోంపాక అనూష ఏడు నెలల గర్భిణి. లక్ష్మీపురంలోని పుట్టింటికి ఆమె భర్తతో కలసి వచ్చింది. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తాను చనిపోతానని బెదిరించిన అనూష... తెల్లవారుజామున ఇంటి ముందు వంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను భద్రచాలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top