విద్యార్థిని ఆత్మహత్యాయత్నం


మహబూబ్‌నగర్ : వైస్ ప్రిన్సిపల్ తిట్టారనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హాస్టల్‌లో ఉంటున్న కొడంగల్ కు చెందిన కె. జ్యోతి(18) పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.



ఈ క్రమంలో శుక్రవారం కళాశాల తరగతి గదిలో వైస్ ప్రిన్సిపల్ నీలిమ హేళనగా మాట్లాడటంతో విద్యార్థిని ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top