పెద్దపల్లి డీఎల్‌పీ కార్యాలయంలో తనిఖీలు


పెద్దపల్లి (కరీంనగర్) : డివిజనల్ పంచాయతీ కార్యాలయం(డీఎల్‌పీ)ను పోలీసులు తనిఖీ చేశారు. కరీంనగర్ జిల్లా పెదపల్లి , డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేసిన వెంకయ్య అనే వ్యక్తి నిరుద్యోగులకు ఉద్యోగం ఎర చూపి రూ.3 కోట్లు వసూలు చేశాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ రోజు డీఎల్‌పీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. తర్వాత ఉద్యోగులను ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top