రైల్వేస్టేషన్‌లో పోలీసుల మమ్ముర తనిఖీలు

రైల్వేస్టేషన్‌లో పోలీసుల మమ్ముర తనిఖీలు - Sakshi


నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటల పాటు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన సుమారు 80 మంది పోలీసులు రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల బ్యాగులను, అన్ని రైళ్లనూ తనిఖీ చేశారు. దీంతో ఎక్కడేం జరిగిందోనని ప్రయాణీకులు ఆందోళన చెందారు.



సికింద్రాబాద్ రూరల్ రైల్వే డీఎస్పీ ఎస్.జి. జగదీశ్వరప్ప ఆధ్వర్యంలో నల్లగొండ, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్ ఏఆర్, నిజామాబాద్ రైల్వే పోలీసులతోపాటు జిల్లాలోని బాంబు, డాగ్‌స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే ప్రతి రైలునూ తనిఖీ చేశారు. ప్రయాణీకులు తమ బ్యాగులు, ఇతర వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని డీఎస్పీ జగదీశ్వరప్ప సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top