పరిగిలో జల్లెడ పట్టిన పోలీసులు


పరిగి : వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసులు శుక్రవారం రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. బహరంపేట, నాయకోటివాడ, శాంతినగర్, బ్రాహ్మణవాడ, బెస్తవాడలో సోదాలు నిర్వహించారు. పరిగి డీఎస్పీ ఆష్‌ఫాక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 110 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు ఎలాంటి పత్రాలు లేని 72 బైక్‌లు, 2 కార్లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top