నిజామాబాద్లో పోలీసుల మెరుపు దాడి
నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. రైల్వే స్టేషన్ ఆవరణలో పాన్ డబ్బాలు, హోటళ్లపై సివిల్ పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. పెన్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. 80 శాతం కాన్సర్ (పుర్రె) గుర్తు, తయారీ ఎక్స్ పైరీ ఇతర ఏ నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. పిల్లలు, యువతకు పెన్ సిగరెట్ల ద్వారా ఆకర్షించి అమ్ముతున్నారని పోలీసులు చెబుతున్నారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు సిగరెట్, బీడీలు అమ్ముతున్న షాపు యజమానులకు జరిమానాలు విధించారు